Tollywood Gossips: Latest Rumors & Buzz in Telugu Cinema
Catch all the latest Tollywood gossips, celebrity rumors, and behind-the-scenes buzz from the Telugu film industry. Stay tuned for hot updates

సినిమా పరిశ్రమ అనగానే ఎప్పటికప్పుడు పలువురు స్టార్ నటీనటుల గురించిన గాసిప్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఇటీవల కూడా పలువురు స్టార్స్ కి వారి సినిమాలకు సంబంధించి రూమర్స్ ని పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. కాగా వారి సినిమాలకు సంబంధించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూమర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న SSMB29 మూవీ ఇప్పటికే 15 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఇందులో ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా ఈమూవీ పై అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇక ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీలో మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ అందాల నటి శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) నటిస్తున్నారు అనేది లేటెస్ట్ రూమర్. కాగా ఈ జోడి కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు, బాలీవుడ్ వారు సైతం ఎప్పటి నుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Telugu film industry rumors
గతంలో శ్రద్ధ కపూర్ మాట్లాడుతూ, తప్పకుండా సూపర్ స్టార్ ప్రక్కన నటించే అవకాశం వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అని తన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఎంతోమంది చెప్పినట్లు ఆమె తెలిపారు. అయితే ఆమె నిజంగానే ఈ మూవీలో నటిస్తున్నారా లేదా అనే దానిపై టీమ్ నుండి క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.
ఇక మరొక రూమర్ ప్రకారం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిప్తి డిమ్రి (Tripti Dimri) హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
యావత్ భారతదేశం లోని ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన ఈమూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ పరంగా సిద్ధమయ్యారు ప్రభాస్. భద్రకాళి మూవీస్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా ఆయనని ఢీ కొట్టే విలన్ గా ప్రముఖ సౌత్ కొరియన్ యాక్టర్ మా డాంగ్ సియోక్ (Ma Dong-Seok) నటిస్తున్నట్లు కొన్నాళ్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
పలు కొరియన్ సినిమాల్లో అతడు నెగటివ్ పాత్రల ద్వారా ఆడియన్స్ అందరికీ సుపరిచితం. అలానే స్పిరిట్ మూవీ కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియన్ ని మించి పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందనుండడంతో తప్పకుండా అతడు ఇందులో విలన్ గా నటిస్తాడు అని మరికొందరు అంటున్నారు. అయితే దీనిపై స్పిరిట్ మూవీ మేకర్స్ నుండి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Tollywood celebrity gossips
ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ (Dragon) అలానే మరోవైపు హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి వార్ 2 సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr). ఈ సినిమాల్లో ముందుగా వార్ 2 మూవీ రానున్న ఆగష్టు 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుండగా వచ్చే ఏడాది జూన్ 25న ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ రిలీజ్ కానుంది.
ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియన్ ని మించి పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాల తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ప్రముఖ యువ కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ ఒక మూవీ చేయనున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ 2 మూవీ తీస్తున్న నెల్సన్ అది పూర్తి అయిన అనంతరం ఎన్టీఆర్ మూవీ కోసం వర్క్ చేయనున్నారు. అయితే ఇప్పటికే వారిద్దరి మధ్య పలుమార్లు స్టోరీ డిస్కషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. అలానే ఎన్టీఆర్ ఒక స్టోరీ లైన్ కి ఓకే చెప్పడంతో త్వరలో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారట నెల్సన్.
ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మితం కానున్న ఈ మూవీ కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో హీరోయిన్ గా నటించనున్నట్లు చెప్తున్నారు. ఆమె కూడా తారక్ తో నటించేందుకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారని, ఫైనల్ గా ఈమూవీ ద్వారా వారిద్దరి జోడీ తెర మీద కనపడనుందని టాక్.
ఇక వీటితో పాటు ప్రస్తుతం కింగ్డమ్ (Kingdom) మూవీ చేస్తున్న యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దాని తరువాత యువ దర్శకులైన రాహుల్ సంకృత్యాన్ తో ఒక మూవీ అలానే రవి కిరణ్ కోలా తో రౌడీ జనార్ధన సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. ఇక వీటి అనంతరం మరొక్కసారి పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కూడా విజయ్ ఒక మూవీకి వర్క్ చేయనున్నారు.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఆ మూవీలో విజయ్ కి జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని తీసుకోవాలని తరుణ్ భాస్కర్ భావిస్తున్నారని, అందులో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉండనున్నట్లు టాక్.
Telugu movie actors controversies
ఇక వీటి తో పాటు మరోవైపు ప్రస్తుతం అట్లీ కుమార్ తో తన కెరీర్ 22వ మూవీ అయిన AA 22 వర్కింగ్ టైటిల్ మూవీ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ మూవీలో ఆయన ట్రిపుల్ రోల్ చేస్తుండగా ఒక రోల్ పూర్తిగా యానిమేటెడ్ గా సాగుతుందని టాక్.
అలానే ఈ మూవీలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తో పాటు దీపికా పదుకొనె (Deepika Padukone) కూడా ఒక హీరోయిన్ గా నటించనుందట. ఇప్పటికే ఈ మూవీ సంగీతం విషయమై యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ తో పాటు హాలీవుడ్ కంపోజర్ అయిన హన్స్ జిమ్మెర్ ని కూడా మూవీ టీమ్ తీసుకుందట.
సన్ పిక్చర్స్ గ్రాండ్ లెవెల్లో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీకి సంబందించిన ఈ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో ప్రతిష్ఠాత్మక గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీస్తున్న రాజమౌళి, ఆ మూవీ అనంతరం తన డ్రీం ప్రాజెక్ట్ అయిన మహాభారతం (Mahabharat) తీసేందుకు తన టీమ్ తో కలిసి మరోవైపు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్.
ఈ మూవీ దాదాపుగా ఐదు భాగాలుగా రూపొందనుండగా దాదాపుగా రూ. 2500 కోట్ల వ్యయంతో అంటే ఒక్కో భాగం దాదాపుగా రూ. 500 కోట్ల వ్యయంతో రూపొందనున్నట్లు టాక్. కాగా ఈ ప్రతిష్టాత్మక మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీలో భారతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన అనేకమంది దిగ్గజ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారట.
హాలీవుడ్ ని తలదన్నేలా ఎంతో భారీ స్థాయిలో హై టెక్నీకల్ వాల్యూస్ తో దీనిని నిర్మించాలి అనేది జక్కన్న ఆలోచనట. అలానే ఎన్టీఆర్ తో కర్ణ తో పాటు గరుడ అనే మూవీని కూడా రాజమౌళి తెరకెక్కించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) తో కూలీ మూవీ తీస్తున్న యంగ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) ఆ మూవీ అనంతరం తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మిగిలి ఉన్న సినిమాలు తీయనున్నారు అనేది మనకు తెలిసిందే.
అయితే వాటి అనంతరం మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో ప్రముఖ కన్నడ అగ్ర నిర్మాణ సంత హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై ఒక భారీ పాన్ వరల్డ్ సినిమా తీసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. దాని అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) లతో కూడా లోకేష్ వర్క్ చేసే ఛాన్స్ ఉందని టాక్.
అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎస్ ఎస్ రాజమౌళి మూవీ అనంతరం గ్లోబల్ గా స్టార్ నటుడిగా ఎవరికీ అందనంత ఉన్నత స్థాయికి దూసుకెళ్లడం ఖాయం. అప్పటికి ఆయన క్రేజ్, మార్కెట్ వేల్యూ అనేవి వరల్డ్ వైడ్ టాప్ స్థాయికి చేరుతాయి అనేది తెలిసిందే. కాగా ఆ ప్రతిష్టాత్మక మూవీ అనంతరం ఆయన తన తదుపరి సినిమాని ఎవరితో చేస్తారు అనేది ప్రస్తుతం ఇండియన్ మూవీ ఆడియన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఆ మూవీ తరువాత సందీప్ రెడ్డి వంగా, బుచ్చి బాబు సన, సుకుమార్ లతో సూపర్ స్టార్ వర్క్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలానే కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) దర్శకుడు నాగ అశ్విన్ కూడా మహేష్ బాబుతో క భారీ హాలీవుడ్ రేంజ్ మూవీ తీసేందుకు సుముఖంగా ఉన్నారట. అయితే మరి పక్కాగా తన తదుపరి సినిమాకి వీరిలో ఎవరికీ మహేష్ బాబు అవకాశం ఇస్తారో తెలియాలి అంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.
అలానే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ (The Rajasaab) తో పాటు హను రాఘవపూడితో ఒక మూవీ, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ (Spirit)తో పాటు త్వరలో ప్రశాంత్ వర్మతో ఒక సినిమా, లోకేష్ కనకరాజ్ తో మరొక సినిమా చేయనున్నారు. అయితే వీటి కంటే ముందు సలార్ 2 అలానే కల్కి 2 కూడా ప్రారంభం కానున్నాయట.
Behind the scenes Tollywood
ఇక వీటి తరువాత ఒకరిద్దరు బాలీవుడ్ ప్రముఖ దర్శకులతో కూడా ప్రభాస్ పని చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనకు టచ్ లో ఉన్నారని, కథలు కూడా వినిపిస్తున్నారని అంటున్నారు. అలానే టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు సన తో పెద్ది అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు.
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి ఆడియన్స్ ముందుకి రానుంది. దీని అనంతరం ఇప్పటికే సుకుమార్ తో ఒక మూవీ చేసేందుకు కమిట్ అయ్యారు రామ్ చరణ్. కాగా ఆ రెండు సినిమాల తరువాత ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ (Sanjay Leela Bhansali)తో ఆయన ఒక భారీ మూవీ చేసే చాన్సు ఉందని టాక్.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా గ్లోబల్ గా ఆడియన్స్ మనసు గెల్చుకున్నారు. ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి పూర్తి వివరాలు వచ్చే ఏడాది చివర్లో వెల్లడవుతాయని టాక్. మొత్తంగా మనం పైన చెప్పుకున్న అందరు స్టార్స్ యొక్క గాసిప్స్ న్యూస్ ప్రస్తుతం అనేక మీడియా మాధ్యమాల్లో విరివిగా ప్రచారంలో ఉన్నవి మాత్రమే.
కాగా వాటికి సంబందించి ఆయా సినిమాల యూనిట్స్ నుండి పక్కాగా అధికారిక ప్రకటనలు వస్తేనే కానీ అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. కాగా ఆయా క్రేజీ ప్రాజక్ట్స్ అన్ని కూడా పెద్ద విజయం అందుకోవాలని కోరుకుందాం. కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్, గాసిప్స్, మూవీ అప్ డేట్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, రివ్యూస్, గ్యాలరీస్ కోసం మా Telugu Movie Media చూస్తూ ఉండండి.
What's Your Reaction?






