SS Rajamouli's Powerful Success Secrets Uncovered
Discover the powerful success secrets behind SS Rajamouli's blockbuster journey – planning, passion, and perfection in filmmaking

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం వరుసగా సక్సెస్ లతో కొనసాగుతున్న దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) అగ్ర స్థానంలో నిలుస్తారు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రతి చిత్రం భారీ సక్సెస్ తో దర్శకుడిగా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న ఎస్ ఎస్ రాజమౌళి, ప్రముఖ కథకుడు వి విజయేంద్రప్రసాద్ కుమారుడు. తన కెరీర్ బిగినింగ్ లో ప్రముఖ టాలీవుడ్ (Tollywood) ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద కొన్ని నెలల పాటు అప్రెంటిస్ గా పని చేసారు రాజమౌళి.
అయితే తన కెరీర్లో ఏ విధంగా ముందుకు సాగాలి అనే ఆలోచన చేసిన అనంతరం డైరెక్షన్ చేయాలని ఫైనల్ గా ఫిక్స్ అయ్యారు రాజమౌళి. అనంతరం చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో కొన్నాళ్ళు పని చేసారు. ఆ తరువాత దర్శకుడు క్రాంతి కుమార్ వద్ద అసిస్టెంట్ గా కూడా వర్క్ చేసారు.
అలానే తన తండ్రి విజయేంద్రప్రసాద్ కి అసిస్టెంట్ గా కూడా పని చేసారు. ఆ తరువాత కొన్నాళ్ళకు చెన్నై నుండి హైదరాబాద్ వచ్చేసిన రాజమౌళి గుణ్ణం గంగరాజు వద్ద చేరి సినిమా మేకింగ్ గురించి కొన్ని మెళకువలు నేర్చుకున్నారు. అలానే దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు వద్ద పనిచేసిన అనంతరం సినిమా తెరకెక్కించడంలో గల కొన్ని మెళకువలు నేర్చుకున్నారు. తెలుగు దేశం పార్టీ సహా కొన్ని కమర్షియల్ యాడ్స్ ని తెరకెక్కించారు రాజమౌళి.
రాజమౌళి విజయం వెనుక ఉన్న రహస్యాలు ఇవే
అదే సమయంలో తెలుగు టివి సీరియల్ శాంతినివాసం తెరకెక్కించారు. ఈ సీరియల్ ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ ఈటివి (Etv) లో 2005లో ప్రసారమై మంచి రేటింగ్స్ అందుకుంది. అయితే అంతకముందు 2001లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Ramarao Jr) హీరోగా రాఘవేంద్రరావు, అశ్వినీదత్ కలిసి నిర్మించనున్న స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసేందుకు అవకాశం అందుకున్నారు.
అప్పట్లో రిలీజ్ అనంతరం ఈ మూవీ పెద్ద విజయం అందుకుని దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే దర్శకుడిగా రాజమౌళి కి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత మరొక్కసారి 2003లో ఎన్టీఆర్ తో ఆయన చేసిన సినిమా సింహాద్రి (Simhadri) అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుని దర్శకుడిగా రాజమౌళి కెరీర్ కి మంచి బాటలు వేసింది.
తరువాత నితిన్ తో సై, ప్రభాస్ (Prabhas) తో ఛత్రపతి (Chatrapathi), రవితేజ తో విక్రమార్కుడు (Vikramarkudu), ఎన్టీఆర్ తో మరొక్కసారి యమదొంగ (Yamadonga) సినిమాలు చేసి వరుసగా సక్సెస్ లతో అపజయం లేకుండా దూసుకెళ్లారు. ఇక 2009లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) తో రాజమౌళి తీసిన మగధీర (Magadheera) సినిమా అప్పట్లో అతి పెద్ద విజయం అందుకుని దర్శకుడిగా రాజమౌళి కీర్తిని మరింతగా పెంచింది. ఆపైన సునీల్ తో మర్యాద రామన్న, అలానే నాని, సమంతలతో ఈగ మూవీ తీశారు.
అవి రెండు కూడా భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. వాటి అనంతరం ఒక్కసారిగా తన సినీ దర్శకత్వ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసి మరింత భారీ సినిమాలు చేయాలనే ప్లాన్ చేసిన రాజమౌళి, ఆ తరువాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్ గా భారీ స్థాయిలో తొలిసారిగా ఆర్కా మీడియా సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ బాహుబలి ది బిగినింగ్ (Baahubali The Beginning). 2015లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో రూ. 650 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని టాలీవడ్ సినిమాని పాన్ ఇండియన్ స్థాయికి తీసుకువెళ్ళింది.
ఆ తరువాత దానికి సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి ది కంక్లూజన్ (Baahubali The Conclusion ) మూవీ అంతకు మించేలా మరింత గొప్ప విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించి రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది. ఈ మూవీస్ లో అమరాండ్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా ప్రభాస్ అద్భుతంగ నటించగా దేవసేనగా అనుష్క శెట్టి (Anushka Shetty), శివగామిగా రమ్యకృష్ణ, భల్లాల దేవుడిగా రానా దగ్గుబాటి (Rana Daggubati), అవంతిక గా తమన్నా (Tamannaah Bhatia) తమ నటనతో అందరినీ అలరించారు.
బాహుబలి, RRR వంటి ఘన విజయం ఎలా సాధ్యమైంది?
మరోవైపు ఈ రెండు సినిమాలను తన అద్భుత దర్శకత్వ ప్రతిభతో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అత్యద్భుత చిత్రరాజాలుగా తెరకెక్కించారు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి. అయితే వీటి తరువాత కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్న రాజమౌళి, టాలీవుడ్ రెండు పెద్ద కుటుంబాలైన నందమూరి కుటుంబం, మెగా కుటుంబం నుండి స్టార్ నటులతో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.
దానితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమా ప్లాన్ చేసి ఎంతో భారీ స్థాయిలో గ్రాండ్ లెవెల్లో డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై నిర్మించారు. మొత్తంగా 2022 మార్చిలో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్సు ని ఫ్యాన్స్ ని ఆకట్టుకుని ఎంతో భారీ విజయం అందుకుంది బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది.
కొమురం బీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పవర్ఫుల్ పాత్రల్లో కనిపించిన ఈమూవీలో బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటులు ఒలీవియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి తదితరులు కీలక పాత్రలు చేసారు. అయితే ముఖ్యంగా ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ (Naatu Naatu Song) ఏకంగా ఆస్కార్ (Oscar Award) అవార్డు సొంతం చేసుకుని భారతీయ సినిమా స్థాయికి హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్ళింది.
ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖ దర్శకులు జేమ్స్ కామెరాన్ (James Cameron), స్టీవెన్ స్పీల్ బర్గ్ (Steven Spielberg) వంటి వారు సైతం రాజమౌళి దర్శకత్వ ప్రతిభని మెచ్చుకోవడం విశేషం. అయితే ఆ సినిమా తరువాత విశ్వవ్యాప్తంగా దర్శకుడిగా తన ప్రతిభని చాటుకున్న రాజమౌళి, ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 చేస్తున్నారు.
ఎన్నో వందల కోట్ల భారీ వ్యయంతో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra), మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తో పాటు పలువురు హాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అనంతరం సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెన్యా, వెస్ట్ ఇండీస్, బల్గెరియా వంటి దేశాల్లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు.
ప్రతి కథలోను ప్రత్యేకతను ఎలా తెచ్చాడు?
ఈ మూవీ 2027 సమ్మర్ కానుకగా రానున్నట్లు టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మొదటి నుండి పనినే దైవంగా భావిస్తుంటారట. మరీ ముఖ్యంగా తాను తీసే సినిమాల విషయంలో దాదాపుగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో నిశితంగా పరిశీలించే జక్కన్న, తన టీమ్ సభ్యులతో ప్రతి సీన్ ని ఎంతో జాగ్రత్తగా చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుంటారట.
అలానే అది ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుందనే కోణంలో పక్కాగా ఎన్నో సార్లు క్రాస్ చెక్ చేయడం అనేది ఆయన యొక్క సక్సెస్ కి ఒక కారణంగా చెప్తుంటారు ఆయన సన్నిహితులు. ఇక ఏదైనా ఒక ప్రాజక్ట్ ని మొదలెడితే పూర్తిగా పక్కాగా తన దృష్టి మొత్తం కూడా దానిపైనే ఉంచడంతో పాటు దానికి ఎంత వరకు ది బెస్ట్ ఇవ్వగలిగితే బాగుంటుందనేది నిరంతరం ఆయన ఆలోచనట.
ముఖ్యంగా ఒక కథని ఫిక్స్ చేసి అక్కడి నుండి నటీనటుల యొక్క ఎంపిక ఎటువంటి సెట్స్ వేయాలి, వాటిని మరింత క్వాలిటీగా ఎలా చిత్రీకరించాలి, బెటర్మెంట్ ఇవ్వాలి అనేది ఆయన ప్రధాన ఆలోచనట. ఇక మూవీ సెట్స్ మీదకు వచ్చిన అనంతరం తన కుటుంబం సహా ప్రపంచం మొత్తాన్ని మర్చిపోయి కేవలం పనినే దైవంగా భావించడంతో పాటు సదరు యాక్టర్స్ నుండి పక్కాగా ది బెస్ట్ ఔట్పుట్ తీసుకునేలా ప్రయత్నిస్తారట. పనిని దైవంగా భావించడంతో పాటు శ్రమయేవ జయతే, కృషితో నాస్తి దుర్భిక్షం అనేవి ఆయన అనుసరించే ప్రధాన విధానాలట.
అందుకే ఆయనని ప్రత్యేకంగా జక్కన్న అని పిలుస్తారు టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎన్టీఆర్. ప్రతి సీన్ ని ఆయన శిల్పంలా చెక్కే తీరుని చూస్తే అది ఆయనకు సరైన పేరు అని పలువురు నటీనటులు చెప్పడం పలు సందర్భాల్లో విన్నాం. ఆ విధంగా ప్రతి సినిమాని తన మొదటి సినిమాగా భావించే రాజమౌళి యొక్క సక్సెస్ సీక్రెట్ ప్రధానంగా పని మీదనే పూర్తి ధ్యాస పెట్టడంతో పాటు శ్రమని ఎంత ఎక్కువ నమ్మి ముందుకు సాగితే అంత మంచి విజయం వస్తుందనే విధానం అనుసరించడమే అసలు సీక్రెట్ అని తెలుస్తోంది. కాబట్టి రానున్న SSMB 29 మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని ఆడియన్సు ని ఆకట్టుకుని దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌళి క్రేజ్ ని పేరుని మరింతగా పెంచాలని మా Telugu Movie Media టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
What's Your Reaction?






