Telugu Actress Savitri – Life, Movies & Legacy
Know the inspiring story of Telugu actress Savitri – her classic movies, powerful roles, personal life, and the legacy she left behind in Indian cinema

మన తెలుగు సినిమా (Telugu Cinema) పరిశ్రమలో నటీమణుల్లో దిగ్గజ నటి ఎవరు అని అంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చే పేరు మహానటి సావిత్రి (Savitri). ఆమె గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుసు. ఆ విధంగా తొలి చిత్రం నుండే అద్భుత నటీమణిగా ఎన్నో గొప్ప సినిమాలు, పాత్రలతో మన అందరినీ మెప్పించి మన గుండెల్లో ఆవిడా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఇక సావిత్రి గారి బయోగ్రఫీ గురించి చెప్పుకోవాలి అంటే నటిగా ఒక్కో సినిమాతో అప్పట్లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు తెలుగు, తమిళ్ వంటి భాషల్లో అప్పటి పలువురు స్టార్ నటుల సరసన నటించి దాదాపుగా అంతే స్థాయి రెమ్యునరేషన్ కూడా అందుకున్న నటి సావిత్రి. మొత్తంగా ఆమె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 250 కి పైగా సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి మనల్ని అందరినీ మెప్పించారు.
సావిత్రి జీవిత చరిత్ర – ఒక లెజెండరీ నటి కథ
ఇక సావిత్రి సినిమా వస్తుంది అంటే చాలు అప్పటి యువత, ఫ్యామిలీ ఆడియన్స్ లో విశేషమైన క్రేజ్. అటు ఎన్టీఆర్, ఇటు ఏఎన్నార్ ఇలా ఎవరికి ప్రక్కన ఆమె చేసినా తనకంటూ ప్రత్యేకంగా శైలిని క్రేజ్ ని సావిత్రి కలిగి ఉండేవారు అంటే ఆమె స్థాయి ఎటువంటిది అనేది మనం అందరం అర్ధం చేసుకోవచ్చు.
Savitri biography in Telugu
అయితే ఆమె మరణానంతరం ఇప్పటికీ కూడా సావిత్రి పేరు చెప్పుకుంటున్నాము అంటే ఆమె ఏ విధంగా స్ఫూర్తిప్రదాత నిలిచారో అర్ధం చేసుకోవచ్చు. 6 డిసెంబర్ 1934లో గుంటూరు జిల్లా చిర్రావూరు;లోని ఒక తెలుగు కాపు కుటుంబంలో సావిత్రి జన్మించారు. నిస్సంకర సుభద్రమ్మ, గురయ్య ఆమె తల్లితండ్రులు. అయితే సావిత్రి ఆరవ నెల వయసులోనే తండ్రి గురవయ్య అనారోగ్యం రీత్యా మరణించారు.
అనంతరం తన తల్లి సుభద్రమ్మ సంరక్షణలోనే పెరిగారు సావిత్రి. అయితే ఆమె మేనమామ కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెకు చదువుతో పాటు నాట్యంలో కూడా ప్రత్యేకంగా తర్ఫీదు ఇప్పించారు. అనంతరం చదువుకునే రోజుల్లోనే పలు నాటకల్లో నాటించ్చి మంచి పేరు గడించిన సావిత్రి, అప్పటి నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు.
సావిత్రి నటించిన క్లాసిక్ సినిమాలు
అయితే ఆ తరువాత సావిత్రి యుక్త వయసులో వెంకట్రామయ్యతో కలిసి వాహిని స్టూడియోలో సినిమాల్లో వేషాల కోసం కొంత ప్రయత్నం చేసినప్పటికీ అప్పట్లో ఫలితం దక్కలేదు. ఆపైన చెన్నయ్ లో అప్పటి నటుడు జెమినీ గణేశన్ వారిని చూసి ప్రత్యేకంగా సావిత్రి ఫోటోలు తీసుకుని రెండు నెలల అనంతరం రమ్మని చెప్పారు.
దానితో సావిత్రి, వెంకట్రామయ్య ఇద్దరూ కూడా తమ ఊరు వెళ్లారు. ఇక రెండు నెలల అనంతరం ఆమెను పిలిపించి తన సినిమాలో అవకాశం ఇచ్చారు జెమినీ గణేషన్. అలానే అదే సమయంలో తెలుగు నటుడు కళావాచస్పతి కొంగర జగ్గయ్య నెలకొల్పిన థియేటర్స్ ఆర్ట్స్ కంపెనీలో తన 14వ ఏట కొన్ని నటనకు కూడా వేశారు.
ఆ విధంగా అక్కడి నుండి తన సినీ ప్రయాణం మొదలెట్టారు సావిత్రి. ఇక 1950లో ఆమె తొలిసారిగా సంసారం సినిమాలో కీలక పాత్ర చ్చేసి తన నటనతో అందరినీ అలరించారు. అనంతరం వచ్చిన రూపవతి, పాతాళభైరవి సినిమాల్లో చిన్న పాత్రల్లో ఆమె నటించారు. ఆ తరువాత 1952లో వచ్చిన పెళ్లి చేసి చూడు చిత్రంలో కీలక పాత్ర చేసి ఆకట్టుకున్న సావిత్రి నటిగా అక్కడి నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు.
Legendary actress Savitri
అక్కడి నుండి అప్పటి స్టార్ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రక్కన ఆమెకు అవకాశాలు రాసాగాయి. అప్పుడే ఏఎన్నార్ తో దేవదాసు, ఎన్టీఆర్ తో మిస్సమ్మ సినిమాలు చేసి మరొక రెండు భారీ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు సావిత్రి. ఇక ఆ సినిమాల విజయాలు ఆమెను నటిగా వెనుతిరిగి చూసుకోనివ్వలేదు.
సావిత్రి వంటి సహజ నటిని మేము చూడలేదు, పాత్రలో పరకాయ ప్రవేశం చేసి యాక్టింగ్ చేయడంతో పాటు తన ఆకట్టుకునే అందంతో కూడా అలరించే వారు అంటూ అప్పట్లోనే పలువురు ప్రముఖ దర్శకులు ఆమెకు కితాబిచ్చారు. అయితే తెలుగు, తమిళ్ తో పాటు మలయాళం, హిందీ సినిమాల్లో కూడా సావిత్రి నటించారు.
కాగా వాటిలో హిందీ సినిమాలు ఆమెకు ఆశించిన స్థాయి సక్సెస్ ని అందించలేకపోయాయి. ఇక 1957 లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, గుమ్మడి, రుషేంద్రమణి, ఛాయాదేవి వంటి దిగ్గజ నటీనటులతో కలిసి మాయాబజార్ సినిమాలో నటించే అవకాశం సావిత్రికి లభించింది. అందులో అభిమన్యుడిగా ఏఎన్నార్ అలానే శశిరేఖగా సావిత్రి నటించారు.
ఇప్పటికీ కూడా మాయాబజార్ లో సావిత్రి పాత్ర ఆమె నటన మనం మరచిపోలేము. ఆ తరువాత అటు తమిళ్ లో జెమినీ గణేశన్ వంటి స్టార్స్ కూడా నటించి మెప్పించి అక్కడి ఆడియన్స్ యొక్క మన్ననలు కూడా అందుకున్నారు సావిత్రి. 1960లో ఆమె చేసిన చివరికి మిగిలేది సినిమాలోని పాత్రకు గాను రాష్ట్రపతి ప్రత్యేక ప్రశంస లభించింది.
ఆమె వ్యక్తిగత జీవితం, గుర్తింపు, మరణం
1963లో నర్తనశాలలో ఆమె పోషించిన ద్రౌపది పాత్రకు ఎంతో గొప్ప పేరు లభించడంతో పాటు జకార్తా లో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రత్యేక ప్రశంస లభించింది. 1968లో సావిత్రి స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు సినిమా మంచి పేరు అందుకోవడంతో పాటు ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వెండి నందిని గెల్చుకుంది. 1948లో తొలిసారిగా జెమినీ గణేశన్ ని కలిసిన సావిత్రి ఆపైన 1952లో వివాహం చేసుకున్నారు.
అయితే అప్పటికే జెమినీ గణేషన్ కి రెండుసార్లు వివాహం జరిగి భార్య, బిడ్డలు ఉన్నారు. అయితే తన కెరీర్ బిగినింగ్ నుండి తనకు లభించిన పారితోషికంలో ఎంతో కొంత మొత్తం ఇతరులకు సహాయం చేసేవారు సావిత్రి. అంతేకాదు ఎవరైనా తమకు ఇబ్బంది ఉంది అని ఆమె వద్దకు వస్తే వెంటనే చెలించిపోయే ఆమె, తన వద్ద ఎంత ఉంటె అంత మొత్తాన్ని వారికి ఇచ్చేసేవారట.
Savitri old movies list
అంత గొప్ప మంచి మనసు ధాతృతం గల హృదయమా సావిత్రి గారిది. అలానే అప్పటి పలువురు చిన్న నటులు, ఆమె దూరపు బంధువులు సైతం ఆమె నుండి ఎంతో కొంత సహాయాం పొందిన వారిలో ఉన్నారనేది పలువురు నాటి సినీ విశ్లేషకులు, ఆమెతో కలిస్ పనిచేసిన నటులు చెప్పే మాట.
ఇక శివాజీ గణేశన్ తో వివాహం అనంతరం కొన్ని కారణాల రీత్యా ఆమె మెల్లగా మద్యానికి బానిస అవడం, ఆపైన తనకు అవకాశాలు కూడా తగ్గడం మొదలైంది. ఇక అక్కడి నుండి సినీ పరిశ్రమకు కొత్త నటీమణుల రాకతో తనకు అవకాశాలు తగ్గడంతో సావిత్రి ఏమాత్రం అధైర్య పడలేదు సరికదా అప్పట్లో కూడా కొంత మేర దాన ధర్మాలు చేసేవారట.
ఇక ఆపైన ఆమె ఆరోగ్యం మెల్లగా క్షీణించడం మొదలైంది. సాటి నటీనటులైన ప్రముఖులు ఆమెకు అప్పట్లో కొంత సాయం అందించారట. మరోవైపు జెమినీ గణేశన్ కూడా ఆమె ఆరోగ్యం విషయమై శ్రద్ధ వహించి ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ మెల్లగా సావిత్రి ఆరోగ్యం మరింత క్షీణించింది.
ఇటీవల సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ, తల్లి యొక్క గొప్ప మనసు, ఔదార్యం గురించి ఎంతో బాగా చెప్పుకొచ్చారు. అయితే మద్యం అలవాటు ఆమెను పూర్తిగా అనారోగ్యంలోకి నెట్టిందని అన్నారు. చివర్లో నాన్నతో పాటు అందరూ ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికే కూడా ఆరోగ్యం సహకరించక ఆమె మరణించినట్లు తెలిపారు విజయ చాముండేశ్వరి.
ఏది ఏమైనా అంతటి మహానటి జీవితంలో అదొక్కటే కొంత మాయని మచ్చగా మిగిలిపోయింది. అయినప్పటికీ కూడా సావిత్రి గారి అందం, అద్భుత నటన గొప్ప మనసు, ఔదార్యం వంటివి మనం ఎప్పటికీ మరువలేము. ఇప్పటికీ కూడా కొందరు యువ నటీమణులు పలు సందర్భాల్లో సావిత్రి గురించి చెప్పడం, ఆమెను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పడం వింటుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంటుంది.
Mahanati Savitri life history
ఇటీవల టాలీవుడ్ స్టార్ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన మహానటి మూవీ ఎంతో అద్భుతంగా ఆడింది. నాగ అశ్విన్ తీసిన ఈ మూవీలో సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ కనబరిచిన సహజ నటన గురించి ఎంతో చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న ఈమూవీలో తన పాత్రలో అద్భుత నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. అంతటి మహానటి జీవిత గాథ ఆధారంగా రూపొందిన మహానటి మూవీలో నటించడం ఎంత ఆనందంగా గర్వముగా అనిపించిందో అలానే జాతీయ అవార్డు లభించడం మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆ మూవీ తన కెరీర్ లో ఎప్పటికీ మరువలేని గొప్ప అనుభూతిని ఇచ్చిందని అవార్డు అందుకున్న సందర్భంగా కీర్తి సురేష్ తెలిపారు.
Evergreen heroines in Tollywood
మొత్తంగా మహానటిగా ఎందరి నుండో మన్ననలు అందుకుని గొప్ప పేరుతో కొట్లాది ప్రేక్షకాభిమానుల హృదయాల్లో సుస్థిర సాధనం సంపాదించుకున్న సావిత్రి గారు భువి నుండి దివికేగినా మన మదిలో నిలిచే ఉంటారు. ఇక సావిత్రి 26 డిసెంబర్ 1981లో తనకు సరిగ్గా 47 ఏళ్ళ వయసులో 19 నెలల కోమా అనంతరం మనల్ని అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అప్పటికే ఆమెకు అధిక రక్తపోటుతో పాటు డయాబెటిస్ కూడా ఉందని సమాచారం. ఏమైనా దివి నుండి ఆ మహోన్నత నటి యొక్క చల్లని దీవెనలు మన అందరి పై ఎల్లపుడూ ఉంటాయి.
What's Your Reaction?






