Padma Bhushan Awards 2025: Balakrishna and Ajith Kumar Honored | Full Details
Tollywood Actor Balakrishna and Tamil superstar Ajith Kumar receive Padma Bhushan Awards 2025. Check full details, reactions, and impact on Telugu cinema.

తెలుగు సినిమా పరిశ్రమలో నటసింహంగా కోట్లాది ప్రేక్షకాభిమానుల హృదయాల్లో ఎంతో గొప్ప పేరు సొంతం చేసుకున్న స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ. లెజెండరీ నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారకరామారావు తనయుడిగా తాతమ్మ కల సినిమా ద్వారా టాలీవుడ్ కి ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.
పద్మభూషణ్ అవార్డ్స్ 2025: బాలకృష్ణ మరియు అజిత్ కుమార్ గార్లకు ఘన సన్మానం
అనంతరం హీరోగా ఒక్కొక్కటిగా అవకాశాలు సొంతం చేసుకుని వాటితో పలు సక్సెలు తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇక కెరీర్ పరంగా పలు ఇండస్ట్రీ హిట్స్ కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఆ విధంగా తన ఆకట్టుకునే వీరోచిత అభినయం, డైలాగ్ డెలివరీ తో అందరి నుండి క్రేజ్ అందుకున్న బాలకృష్ణ తాజాగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
ఇక కోలీవుడ్ లో స్టార్ నటుడు అజిత్ కుమార్ పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కి అలానే రికార్డ్స్ కి ఆయన పెట్టింది పేరు. కెరీర్ మొదటి సినిమా నుండి ఒక్కో సినిమాతో కోట్లాది ఫ్యాన్స్ ఆడియన్స్ యొక్క మనసులు దోచిన అజిత్ కుమార్, ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద విజయం అందుకున్నారు.
బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు గెలుపు విశేషాలు
ఇక అజిత్ నుండి మూవీ వస్తుంది అంటే ఫ్యాన్స్ లో విపరీతమైన జోష్ ఉంటుంది. తాజాగా అజిత్ కి కూడా పద్మభూషణ్ అవార్డు దక్కింది. నేడు పార్లమెంట్ భవనంలో అత్యంత వైభవంగా జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవం వేడుకలో బాలకృష్ణ, అజిత్ కూడా తమ తమ కుటుంబాలతో కలిసి సందడి చేసారు.
అజిత్ కుమార్ గారి సన్మానం మరియు సినీ పరిశ్రమ ప్రతిస్పందన
మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు విజేతలకు తన చేతుల మీదగా ప్రధానోత్సవం చేసారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు పలువురు కేంద్రమంత్రులు అందరూ పాల్గొన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది. తన యొక్క పేరుని పరిశీలించి పద్మభూషణ్ అవార్డు అందించిన ప్రభుత్వానికి మరియు సినీ పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు హీరో అజిత్.
అలానే బాలకృష్ణ మాట్లాడుతూ, తనకు ఇంతటి అత్యున్నత పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి, సినీ పరిశ్రమలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా అజిత్, బాలకృష్ణ ల కుటుంబాలు వారిద్దరూ అవార్డులు అందుకున్న సమయంలో హర్షద్వానాలు వ్యక్తం చేసారు. ప్రస్తుతం పద్మ అవార్డుల వేడుక న్యూస్ భారతదేశ మీడియాలో విశేషంగా ప్రసారం అవుతోంది.
What's Your Reaction?






